SRD: ఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో రైతులు సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేశారు. స్థానిక రైతు వేదికలో ఇవాళ జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులు వీక్షించారు. ఇందులో రైతు భరోసా నిధులు విడుదలపై ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతు వేదిక వద్ద రైతులు సంబరాలు జరుపుకున్నారు.