NLG: దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 275 మంది గ్రామస్థులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుంటామని కంపెనీ ప్రతినిధి మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆలేటి సంధ్య, ఎండీ యూసఫ్, తదితరులు పాల్గొన్నారు.