NLG: భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణోత్సవానికి సిద్ధం చేసిన సహజ గోటి తలంబ్రాలను మహిళా భక్తులు దేవస్థాన అధికారులకు ఇవాళ అందజేశారు. జిల్లాలోని వివిధ ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ఒలిచిన ఈ తలంబ్రాలను హిందూ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు ఉమా భారతి, సభ్యులు కలిసి భద్రాద్రి రామయ్యకు సమర్పించారు. స్వామివారి కళ్యాణంలో ఈ తలంబ్రాలను ఉపయోగించనున్నారు.