ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. జనరల్ విభాగంలో 126 మందికి 121 మంది, ఒకేషనల్ విభాగంలో 100 మందికి 96 మంది హాజరయ్యారు. మొత్తం 9 మంది విద్యార్థులు పరీక్షకు రాలేదని అధికారులు తెలిపారు. ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పటిష్ఠ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.