శ్రీకాకుళం జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఆర్.వెంకట్రామన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జడ్పీ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న ఈయనకు సీఈవోగా ప్రమోషన్ కల్పించి జిల్లాకు బదిలీ చేశారు. ఈయన గతంలో జిల్లాలో ఎంపీడీవో గా పనిచేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.