JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సోమవారం మొత్తం రూ.1,58,519 ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల ద్వారా రూ.65,944, ప్రసాదాల ద్వారా రూ .81,000, అన్నదానం ద్వారా రూ.11,575 వసూలైనట్లు ఆయన వెల్లడించారు. భక్తుల రాక కొనసాగుతుండటంతో ఆలయ ఆదాయం స్థిరంగా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.