HNK: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని తహసిల్దార్ విజయలక్ష్మి అన్నారు. పరకాల గర్ల్స్ హై-స్కూల్ లోని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలని, చదువు మన తలరాతను మారుస్తుందని తహసిల్దార్ అన్నారు. ఆర్ఐ దామోదర్, స్కూల్ ఇన్ఛార్జ్ పద్మజ, ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ ఉన్నారు.