NRPT: మద్దూరు మున్సిపాలిటీలో ఈ ఆర్థిక సంవత్సరానికి తై బజార్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఆసక్తి గలవారు మార్చి 15 నుంచి 23 వరకు రూ. 5 లక్షల డిపాజిట్, రూ.1000 చలాన్ చెల్లించాలని సూచించారు. ఈ బహిరంగ వేలం మార్చి 25న మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జరుగుతుందని వెల్లడించారు.