KMM: ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు రూ. 7,72,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బుధవారం అందజేశారు. కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ సామాన్యులకు అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. ఆపదలో ఉన్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందే ఈ ఆర్థిక సాయం ఒక వరం లాంటిదన్నారు.