WNP: తోమాలపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ దేవాలయాన్ని పూలతో అందంగా అలంకరించి రాములవారి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. భక్తుల సౌకర్యార్థం ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆనంద్, భరత్, వేణు, రాముడు యాదవ్, మధు, శేషి రెడ్డి పాల్గొన్నారు.