PDPL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లిలోని 2, 21వ వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. ఎమ్మెల్యే సహకారంతో పట్టణంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని ఛైర్మన్ మల్లయ్య తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలతో ప్రజలకు లాభం చేకూరిందన్నారు. ఐటీఐ గ్రౌండ్ అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతున్నాయన్నారు.