BDK: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ’99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జూలూరుపాడు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేసి, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలు, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.