KNR: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఇవాళ 4వ వార్డును సందర్శించారు. కొత్తపల్లి ప్రాంతంలో పరిశుభ్రత పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో తన కుటుంబం పని చేసిందని, కార్మికుల సమస్యలు ఏవి ఉన్నా నేరుగా తెలపాలని పేర్కొన్నారు. అనంతరం డ్రైనేజ్ శుభ్రం చేశారు.