అన్నమయ్య: రామాపురం మండలంలో ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల ప్రమాద భీమా చెక్కులను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ఈ భీమా మంజూరైనట్లు మండల అధ్యక్షుడు గాలివీటి సురేందర్ రెడ్డి తెలిపారు.