NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శనివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఎంపీవో గోవర్ధన్ మాట్లాడుతూ.. గత ఐదు రోజుల నుంచి నేర్చుకున్న అంశాలను వార్డు సభ్యులు ఆయా వార్డులలో ఆచరణలో పెట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని అన్నారు. అనంతరం శిక్షణ సర్టిఫికెట్లను వార్డు సభ్యులకు అందజేశారు.