GDWL: శాంతినగర్ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 24వ రోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కమిషనర్ ఎస్. రాజయ్య ఆధ్వర్యంలో 7వ వార్డులో డ్రైనేజీల పూడికతీత, 8వ వార్డులోని ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో శానిటేషన్ నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పరిసరాలను శుభ్రం చేసినట్లు అధికారులు తెలిపారు.