KNR: సైదాపూర్ మండలంలో ఉండాల్సిన ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం కరీంనగర్ లో ఉండటంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. సాగునీటి సమస్యలు, కాల్వల మరమ్మతులపై ఫిర్యాదు చేయాలంటే అధికారులు కనిపించక, కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ జాప్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, మండలంలో కార్యాలయం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.