MBNR: స్నేహపూర్వక వాతావరణంలో హిందూ ముస్లింలు పండగలు జరుపుకోవాలని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో పార్టీ తరఫున ఇఫ్తార్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే ఉగాది రంజాన్ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మిథున్ రెడ్డి ఆనంద్ గౌడ్ కోత్వాల్, జహీర్ పాల్గొన్నారు.