BDK: ఆళ్లపల్లి మండలంలోని రైతులందరూ త్వరితగతిన రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి (ఏవో) కుమార్ రాజా సూచించారు. యూరియా బుకింగ్, పంటల కొనుగోలు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. దీనిని రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలతో అనుసంధానించామని రిజిస్ట్రీ చేసుకున్న వారికే ఆర్థిక సాయం అందుతుందని స్పష్టం చేశారు.