పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ఇవాళ పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగిందని అధికారులు తెలిపారు. పత్తి కనిష్ట ధర క్వింటాకు రూ. 5,511 కాగా, గరిష్ట ధర రూ. 7,469గా నమోదయింది. మొత్తం 258 మంది రైతులు 871 బస్తాల్లో 931.97 క్వింటాళ్ల పత్తిని విక్రయించడానికి తీసుకువచ్చారు.