NZB: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.