BHNG: అడ్డగూడూరు మండల పరిధిలోని డి.రేపాక గ్రామ శివారులోని మూసీ నది నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. గ్రామానికి చెందిన లోడంగి శ్రీకాంత్ (29), ముక్కముల మల్లేష్ (25), కన్నా స్వామి (30) నుంచి మూడు ట్రాక్టర్లను అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.