NLG: చింతపల్లి మండలం మాల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతతో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించి నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే తెలిపారు.