MDCL: ప్రొడెన్షియల్ బ్యాంక్ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. శుక్రవారం బోయినపల్లిలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కాలనీలో నివసిస్తున్న యువత, వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.