పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జియమ్మవలస మండలం చినకుదమ గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.