NLR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వేగూరు పంచాయతీలో రూ. 2.78 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని కోవూరు MLA ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రతి గ్రామంలో తాగునీరు, స్మశాన వాటికలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని దానికి అనుగుణంగా దాదాపు పూర్తి చేశామన్నారు. గ్రామంలో వాటర్ ట్యాంక్, డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులను చేశామన్నారు.