SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి పొన్న వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు స్వామివారికి ప్రత్యేక మంగళహారతులు అందించి శోభాయాత్ర నిర్వహించారు. గ్రామమంతా భక్తి వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆంజనేయులు యాదవ్, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.