ATP: గుత్తి దాసరి కాలనీకి చెందిన వెంకటేష్ అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.