SDPT: బెజ్జంకి వడ్ల కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు రాజు ఆరోపించారు. మంచి నాణ్యత ఉన్న ‘ఏ’ గ్రేడ్ వడ్లను ‘బీ’ గ్రేడ్గా నమోదు చేసి రైతులను నష్టపరుస్తున్నారని తెలిపారు. క్వింటాల్కు రూ.2,389 మద్దతు ధర వెంటనే అమలు చేయాలని, తేమ పరీక్షలు రైతుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలని, అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.