జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద శనివారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రతిరోజూ ఇక్కడ జరిగే ‘జనగణమన’ గీతాలాపనలో భాగంగా ఆయన స్థానికులు, యువతతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణతో పాటు దేశభక్తిని పెంపొందిస్తాయన్నారు.