KMM: యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ కొరత పెరిగిందని, కొందరు దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండల కార్యదర్శి దూసరి గోపాలరావు విమర్శించారు. చింతకాని మండలంలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో గ్యాస్ సిలిండర్ల కొరత, నిత్యావసరాల ధరల నియంత్రణపై వినతిపత్రం సమర్పించారు.