KNR: కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని సిల్వర్ స్ప్రింగ్ విల్లాల్లో విద్యుత్ వైర్ల దొంగతనానికి పాల్పడ్డ నలుగురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 60 వేల విలువైన వైర్ బండళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వీరు జల్సాల అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.