JGL: పెగడపల్లి మండలానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.51.52 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనట్లు మండల పంచాయతీ అధికారి శశి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన రూ. 50 వేల నుండి రూ. ఆరు లక్షల వరకు మంజూరయ్యా యని, ఈ నిధులను ఆయా జీపీల్లో జమవుతాయన్నారు.