RR: సంత్ శిరోమణి భగత్ గురు రావిదాస్ మహారాజ్ జయంతి సందర్భంగా పి.జే.ఆర్ నగర్లో కమిటీ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రావిదాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. మహారాజ్ చేసిన సామాజిక సంస్కరణలు, ఆధ్యాత్మిక సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.