నాగర్ కర్నూల్: కుమ్మెర జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందడం అమానుషమైన ఘటన అని బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు గడ్డం భరత్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. చిలుకేశ్వరం చాకలి చంద్రకళ దైవదర్శనం కోసం వెళ్తే కాంగ్రెస్ నాయకులు దాడి చేసి, పసికందు మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.