ADB: ప్రజల సమస్యలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం జరిగిందని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.