SRPT: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మద్దిరాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ప్రాణం కాపాడటమే తమ సంకల్పమన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు.