BHPL: జిల్లాలో వెలికితీసిన బొగ్గును రవాణా చేయడానికి ట్రక్కులపై ఆధారపడకుండా రైల్వే లైన్ మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం తగ్గడంతో పాటు సరుకు రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. రైల్వే లైన్ మంజూరు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరిత చర్యలు చేపట్టాలని కోరారు.