JGL: కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గల మోడల్ స్కూల్ విద్యార్థులకు మట్టి నమూన పరీక్షపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారిని నాగమణి మట్లాడుతూ.. సేంద్రియ, సహజ వ్యవసాయం నేలలో సరైన ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. రసాయన ఎరువులు వాడకంతో నేలలో సారం తగ్గిపోతుందన్నారు. అలాగే నేలలో జరిగే చర్యల గూర్చి విద్యార్థులకు వివరించారు.