HYD: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి అన్నారు. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో HYD ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభయహస్తం పేరుతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కార్యచరణ రూపొందించాలన్నారు.