KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని ఇరుకు దారి విస్తరణ కోసం పంచాయతీ పాలకవర్గం చర్యలు చేపట్టింది. పురాతన ఇళ్లను ఈ క్రమంలోనే ఆదివారం కూల్చివేశారు. కానీ, అదే మార్గంలో ఉన్న బడా బాబుల ఇండ్లను కూలుస్తారా లేదా అనే ప్రశ్నలను ప్రజలు లేవనెత్తుతున్నారు. సమన్యాయం పాటించాలని, ఇండ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.