PDPL: కమాన్పూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం BRS నాయకులు సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, 41 కిలోల బదులు 42 కిలోల తూకం వేస్తున్నారని మండల అధ్యక్షుడు తాటికొండ శంకర్ ఆరోపించారు. ఎండల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు.