NRPT: ధన్వాడ మండలంలోని కిస్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి స్వయం కృపరికాలన దినోత్సవం నిర్వహించుకున్నారు. పాఠశాల హెచ్ఎంగా సావిత్రి, డీఈవోగా శ్యామ్ రాజ్, ఎంఈవోగా శ్రీ చందన వ్యవహరించారు. ఉత్తమంగా విద్యా బోధన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్టు పాఠశాల హెచ్ఎం సరస్వతమ్మ తెలిపారు.