SRPT: తిరుమలగిరి మండలం తాటిపాములలో ఇందిరమ్మ ఇళ్లకు శుక్రవారం ఎమ్మెల్యే సామేలు భూమి పూజ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయపల్లి కిషన్ పాల్గొన్నారు.