MNCL: నెన్నెల మండలంలోని గిరిజన బాలల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆదివారం హాస్టల్ ఎదుట నిరసనకు దిగారు. తమ సమస్యలపై AISB నాయకులకి చెపితే హాస్టల్ వార్డెన్ బెదిరిస్తున్నారని వాపోయారు. తమకి సరిగ్గా భోజనం పెట్టడం లేదని, సిబ్బంది మాత్రం ప్రత్యేకంగా భోజనం వండుకుని తింటారన్నారన్నారు. ఆరోగ్యం బాగోలేకుంటే కూడా పట్టించుకోవడం లేదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.