MHBD: గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే ధ్యేయమని బ్రాహ్మణకొత్తపల్లి సర్పంచ్ డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో MGNREGS నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జెల్ల పరుశరాములు,తాళ్ళ మునేష్ తదితరులు పాల్గొన్నారు.