SRPT: నడిగూడెం మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన కాసాని సాయి 74వ జాతీయ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన సాయిని మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కోటి, కార్యదర్శి కరుణాకర్ అభినందించారు. ఈ సందర్భంగా సాయికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు వీరేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.