RR: రాజకీయాలకు డబ్బు జబ్బు పట్టుకుందని ఈ ధోరణిలో మార్పు రాకపోతే సామాన్యుడు రాజకీయాల్లోకి రాలేని దుస్థితి ఏర్పడుతుందని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓటు ప్రజలు బాధ్యతగా భావించాలని, కేవలం డబ్బుల కోసం ఓట్లు వేసే ధోరణికి దూరం కావాలని అన్నారు.