KNR: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన యువకుడు కొత్త శ్రావణ్ (26) తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.