NLG: నాంపల్లి మండలంలోని ఎస్డబ్ల్యూ లింగోటం పంప్ హౌస్లో 440 స్థాయి పంపుల బేరింగ్లు విరిగిపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు రాబోయే 3 రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని అధికారులు వెల్లడించారు. మరమ్మత్తులు పూర్తయ్యే వరకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వారు సూచించారు.